Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారింజ రసాన్ని తాగితే ఎంత మేలో తెలుసా?

నారింజలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. నిమ్మజాతి పండ్లలో నారింజ కూడా ఒకటి. తీపి, పులుపు కలగలసిన రుచితో వుండే ఈ పండును తీసుకుంటే.. శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగిస

Advertiesment
Orange
, మంగళవారం, 17 అక్టోబరు 2017 (14:02 IST)
నారింజలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. నిమ్మజాతి పండ్లలో నారింజ కూడా ఒకటి. తీపి, పులుపు కలగలసిన రుచితో వుండే ఈ పండును తీసుకుంటే.. శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. యవ్వనాన్ని పెంపొందింపజేస్తుంది.

నారింజలో పులుపు, తీపితో కూడిన రెండు రకాలున్నాయి. వీటిలో వానాకాలంలో వచ్చే పుల్ల నారింజలో నీరు అధికంగా, లవణాలు తక్కువగా వుంటాయి. వేసవిలో వచ్చే తీపి నారింజలో నీరు తక్కువ, లవణాలు ఎక్కువ.
 
నారింజలో తక్కువ విటమిన్ ‌- ఏ, బి, ఎక్కువ విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒక గ్లాసు నారింజ రసం తాగితే రోజుకు కావాల్సిన విటమిన్‌ లభిస్తుంది. నారింజ రసం మంచి శక్తిని అందిస్తుంది. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు నారింజలో లభిస్తాయి. నారింజ పండు వినియోగంతో రోగ నిరోధక శక్తి పెరిగి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయి.
 
చిగుళ్ల వాపు, రక్తం కారటం, నోటి దుర్వాసన వంటి పలు దంత సమస్యల బాధితులు నారింజ రసాన్ని సేవిస్తే ఇబ్బంది తగ్గుతుంది. జ్వరం, అనారోగ్యం కారణంగా జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజ రసాన్ని తాగితే.. జీర్ణశక్తి పుంజుకుంటుంది. పేగుల్లోని క్రిములు నశిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైదా పిండి వద్దే వద్దు.. పరోటాలు లాగిస్తే అంతే సంగతులు...