Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నొప్పే కదా అని మసాజ్ చేసుకుంటే.. ప్రాణమే పోతుంది జాగ్రత్త...

కాలికి ఏదైనా గాయమై, రక్తం గడ్డకట్టినప్పుడు అక్కడ ఏదైనా తైలం లేదా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ క్రీములను పూయమని, కానీ ఆ ప్రాంతంలో గట్టిగా ఒత్తిడి కలిగించకూడదని వైద్యులు చెప్తూనే ఉంటారు. మరి ఢిల్లీలోని ఓ తల్లికి ఈ విషయం తెలియక చేతికి అందివచ్చిన కొడుకుని పోగొట్టు

నొప్పే కదా అని మసాజ్ చేసుకుంటే.. ప్రాణమే పోతుంది జాగ్రత్త...
, మంగళవారం, 2 మే 2017 (11:56 IST)
కాలికి ఏదైనా గాయమై, రక్తం గడ్డకట్టినప్పుడు అక్కడ ఏదైనా తైలం లేదా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ క్రీములను పూయమని, కానీ ఆ ప్రాంతంలో గట్టిగా ఒత్తిడి కలిగించకూడదని వైద్యులు చెప్తూనే ఉంటారు. మరి ఢిల్లీలోని ఓ తల్లికి ఈ విషయం తెలియక చేతికి అందివచ్చిన కొడుకుని పోగొట్టుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే... ఓ 23 ఏళ్ల యువకుడికి బ్యాడ్మింటన్ ఆడే సమయంలో కాలి మడమకు గాయమైన ఫలితంగా కాలి నరాల్లో రక్తం గడ్డకట్టింది. కాలికి వేసిన ప్లాస్టర్ తీసివేసినప్పటికీ, అతని కాలి నొప్పి, వాపు తగ్గలేదు. కొడుకి బాధ చూడలేని తల్లి కాలిని మసాజ్ చేసింది. మసాజ్ చేసే సమయంలో ఆమె ఉపయోగించిన శక్తికి కాలిలో గడ్డకట్టిన రక్తం అక్కడి నుండి కదిలి, అతని ఊపిరితిత్తుల్లోకు రక్తాన్ని సరఫరా చేసే పుఫుస ధమనుల్లోకి ప్రయాణించి వెంటనే అతని గుండె ఆగిపోయేలా చేసింది.
 
సాధారణంగా గడ్డకట్టిన రక్తం క్రమంతప్పకుండా నిపుణులు ఇచ్చే ఔషధాలతో వాటంతటవే కరుగుతాయని, అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు చాలా అరుదుగా ఇలాంటివి సంభవిస్తాయని, ప్లాస్టర్ తీసివేసిన తర్వాత కూడా నొప్పి లేదా వాపు తగ్గకుంటే ఎముకల వైద్య నిపుణుడిని సంప్రదించాలి కానీ స్వంత వైద్యం కూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, తేనె కలిపి స్నానం చేస్తే?