Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లైన యువకులు భార్య వండిపెట్టే కమ్మని వంటను తెగ లాగిస్తున్నారు.. దీంతో ఏమౌతుందంటే?

పెళ్లికి ముందు.. అమ్మ చేతివంట, ఫాస్ట్ ఫుడ్ తిని తిని విసిగిపోయిన యువకులు పెళ్లై పిల్లలు పుట్టిన కొంత కాలం వరకూ బరువు పెరిగిపోతున్నారని తాజా పరిశోధనలో తేలింది. పెళ్లికాని యువకులు ఇంటి భోజనాన్ని పెద్దగా

పెళ్లైన యువకులు భార్య వండిపెట్టే కమ్మని వంటను తెగ లాగిస్తున్నారు.. దీంతో ఏమౌతుందంటే?
, శుక్రవారం, 23 జూన్ 2017 (15:11 IST)
పెళ్లికి ముందు.. అమ్మ చేతివంట, ఫాస్ట్ ఫుడ్ తిని తిని విసిగిపోయిన యువకులు పెళ్లై పిల్లలు పుట్టిన కొంత కాలం వరకూ బరువు పెరిగిపోతున్నారని తాజా పరిశోధనలో తేలింది. పెళ్లికాని యువకులు ఇంటి భోజనాన్ని పెద్దగా పట్టించుకోకుండా తిరుగుతారు. కానీ పెళ్లైన వారు మాత్రం భార్య వండిపెట్టే కమ్మని వంటకాలను తెగ లాగించేస్తారు. అందుకే వారు పెళ్లైన కొత్తల్లో లావుగా మారిపోతారు.
 
దీనిపై జరిగిన పరిశోధనలో పెళ్లైన యువకులతో పాటు అదే వయసు ఉండి ఇంకా పెళ్లి చేసుకోని యువ‌కులకు మధ్య బాడీ మాస్ ఇండెక్స్‌ను చూశామ‌ని పరిశోధకులు తెలిపారు. వారి మధ్య బాడీ మాస్ ఇండెక్స్ సగటున 1.4 కేజీల వరకూ తేడా ఉందన్నారు. 
 
తద్వారా భార్య చేతి వంట తిని పెళ్లైన యువకులు పిల్లలు పుట్టేంత వరకు బరువు పెరుగుతున్నారని బ్రిటన్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బాత్ నివేదికలో వెల్లడైంది. స‌న్నగా ఉన్న‌వారు కాస్త బ‌రువు పెరిగినా ఫ‌ర్వాలేదు కానీ, అలాగే బ‌రువు పెరుగుతూ వెళ్లిపోతే వాటితో పాటు అనారోగ్యం కూడా వ‌స్తుంద‌ని తెలిపింది. కాలేయ సంబంధిత రోగాలతో ఇలాంటి వారికి తిప్పలు తప్పవని.. అందుచేత ఫిట్‌నెస్ కోసం జిమ్‌లకు వెళ్ళడం, వాకింగ్ చేయడం వంటివి పాటిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలా చేస్తే గుండెపోటే రాదు...!