Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో మెంతుల పొడిని తీసుకుంటే ఎంత మేలు జరుగుతుందంటే?

మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించు

వేసవిలో మెంతుల పొడిని తీసుకుంటే ఎంత మేలు జరుగుతుందంటే?
, మంగళవారం, 29 మే 2018 (10:27 IST)
మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు సహాయపడుతుంది. మెంతులు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఇలాంటి వ్యాధులనుండి దూరంగా ఉండవచ్చును.
 
మెంతుల్ని తీసుకోవడంతో పాటు రోజూ అరగంట వాకింగ్ చేస్తే బరువు తగ్గుటకు ఉపయోగపడుతుంది. శరీరానికి గల ఉదరసంబంధిత రుగ్మతలు ఏర్పడకుండా మెంతులు సహాయపడుతాయి. ఈ మెంతులకు పొడి చేసుకుని నీటిలో లేదా మజ్జిగలో కలుపుకుని భోజనానికి 15 నిమిషాల ముందు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. షురగ్ లెవన్‌ను కంట్రోల్ చేస్తుంది. అలాకాకుంటే వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని డ్రైన్డ్ చేసి ఆ మిశ్రమాన్ని చపాతీ, ఇడ్లీ, పొంగల్, పెరుగు, ఉప్మా వీటినన్నింటిలో వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
తల్లులకు పాల ఉత్పత్తిని పెంచేందకు మెంతులు చాలా ఉపయోగపడుతాయి. దీనిని ఎలా తీసుకోవాలంటే, మెంతులకు నెయ్యిలో వెయించి వాటిని బాగా నూరి ఆ చూర్ణానికి సమానంగా గోధుమ పిండిని కలిపి ఆ మిశ్రమంలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాలేకుంటే మెంతులతో చేసిని కషాయాన్ని, మెంతికూర పప్పును తీసుకుంటే కూడా మంచిది.
 
ఈ మెంతులను రోజు ఆహారంలో తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగి జీర్ణక్రియకు సహాయపడుతాయి. మలబద్దకం తొలగిపోతుంది. నిమ్మరసంలో మెంతుల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం నుంచి విముక్తి చెందవచ్చును. గాయాలకు, పుండ్లకు, తామర, గజ్జి, ఎండవలన కందిపోయి చర్మం వంటి సమస్యలకు మెంతుల పొడిని తీసుకుంటే మంచిది. ఆ మెంతుల పొడిలో కొంచెం నీళ్లుపోసి పేస్ట్‌లా తయారుచేసుకుని మీ చర్మానికి రాసుకుంటే పైన తెలిపిన సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చును.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చక్కెర వ్యాధికి విరుగు కనిపెట్టండి: శాస్త్రవేత్తలకు వెంకయ్య పిలుపు