Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయి పండుతో ఉదర సంబంధిత వ్యాధులు మటమాయం!

Advertiesment
Papaya
, మంగళవారం, 17 మే 2016 (15:41 IST)
ప్పాయి పండులో వున్న విటమిన్లు మరెందులోను ఉండదు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగుమోతాదులో ఉన్నాయి. ప్రతి రోజు బొప్పాయి పండును తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఉదర సంబందమైన జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది, అంతేకాదు మొటిమలను కుడా తగ్గిస్తుంది. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ వేసుకోవటం వలన జిడ్డుచర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా వీటిని ఎక్కువగా వాడుతున్నారు.
 
బొప్పాయిలోని బీటా కెరోటిన్‌ క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండులోని పీచు మొలల్నీ రానివ్వకుండా సహాయపడుతుంది. బొప్పాయి పండును ప్రతి రోజు తీసుకోవడం వలన మహిళలకు రుతుక్రమం క్రమంగా వస్తుంది. బొప్పాయి ఫైల్స్ వ్యాధిని అరికడుతుంది.
 
ప్రతి రోజు అన్నం తిన్న తర్వాత 3, 4 బొప్పాయి ముక్కలను తింటే తేలికగా జీర్ణం అవుతుంది. బొప్పాయి పండు తినడంవల్ల జలుబు, చెవినొప్పి వంటి కూడా తగ్గుతాయి. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. పచ్చి బొప్పాయి కాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే వ్యాయామ మార్గాలేంటి?