Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజూ అన్నం తింటే సరిపోదు.. పండ్లు కూడా తీసుకోవాలి.. అప్పుడే సంతోషంగా ఉంటారు

రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను

Advertiesment
Fruits
, ఆదివారం, 14 ఆగస్టు 2016 (10:30 IST)
రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను చేర్చుకుంటామో మన సంతోషం పెరుగుతుందని, సుమారు రెండు వేలమంది మీద వీరు సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 
 
వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ ఆహారంతో పాటు ఐదురకాల పళ్ళు అందించారు. రెండవ గ్రూపు వారికి కేవలం ఆహారం మాత్రమే అందించారు. కొన్ని నెలల అనంతర వీరి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తే.. పండ్లు మాత్రమే తీసుకునే వారు సంతోషంగా ఉన్నట్లు వెల్లడి అయ్యింది. కేవలం ఆహారం మాత్రమే తీసుకునే వారిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత తగ్గడం వీరి దృష్టికి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎప్ప‌టికీ మీ చ‌ర్మం నిగారింపు... నిండా ప‌ద‌హారే... ఇలా చేస్తే...