Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసా? అలా తింటే అనారోగ్యమే

నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసా? అలా తింటే అనారోగ్యమే
, శుక్రవారం, 16 జూన్ 2023 (16:18 IST)
నేరేడు పండు. నేరేడు పండు అనేక ఔషధ, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే వీటిని తినడానికి సరైన మార్గాలున్నాయి. ఎలాబడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తినకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచినీళ్లు తాగకూడదు. నేరేడు పళ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు.
 
 
నేరేడు తిన్న తర్వాత పాలు తాగకూడదు. నేరేడు పండ్లు తిన్న తర్వాత పచ్చళ్లు ఎప్పుడూ తినకూడదు. ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం వుంది. నేరేడు పండ్లు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. నేరేడు పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలకు అడ్వైజ్ చేయడం ఆపేయండి..