Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏటీఎం సెంటర్లకు వెళ్ళొచ్చారా? ఐతే భోజనం చేసేందుకు ముందు చేతులు వాష్ చేసుకోండి..

భోజనానికి ముందు.. బాత్రూమ్ వినియోగం తర్వాత చేతులు కడుక్కోవడం సహజం. చేతులు మురికిగా మారిన ప్రతిసారి శుభ్రం చేసుకోవడం పరిపాటి. అయితే డెబిట్ కార్డు ఉప‌యోగం త‌ర్వాత చేతులు క‌డుక్కోవాలంటున్నారు ఆరోగ్య నిప

ఏటీఎం సెంటర్లకు వెళ్ళొచ్చారా? ఐతే భోజనం చేసేందుకు ముందు చేతులు వాష్ చేసుకోండి..
, సోమవారం, 28 నవంబరు 2016 (10:58 IST)
భోజనానికి ముందు.. బాత్రూమ్ వినియోగం తర్వాత చేతులు కడుక్కోవడం సహజం. చేతులు మురికిగా మారిన ప్రతిసారి శుభ్రం చేసుకోవడం పరిపాటి. అయితే  డెబిట్ కార్డు ఉప‌యోగం త‌ర్వాత చేతులు క‌డుక్కోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏటీఎం సెంట‌ర్ల‌లో మాన‌వుల చ‌ర్మంలోని సూక్ష్మ జీవులు (స్కిన్ మైక్రోబ్స్‌) వ్యాపించి ఉంటున్నాయ‌ని, ఇవి ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని త‌మ తాజాగా పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలు, బ్యాంకుల్లో జనాలు నిండిపోతున్న సంగతి తెలిసిందే. వాటిని ఉపయోగించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అందుకే ఏటీఎం ఉప‌యోగించాక చేతుల్ని వాష్ చేసుకుంటే అవి నోటి ద్వారా క‌డుపులోకి చేరి అనారోగ్యానికి కార‌ణ‌మ‌య్యే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.
 
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌, మాన‌హ‌ట‌న్‌, క్వీన్స్ ప్రాంతాల్లోని 66 ఏటీఎంల నుంచి సేక‌రించిన ధూళిని ల్యాబుల్లో ప‌రీక్షించ‌గా ఈ విషయం వెల్లడైందని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలిచలిగా చలికాలం... మంచి మూడ్‌లోకి రావాలంటే గోరువెచ్చని వేడినీటి స్నానం