Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి

ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి
, శనివారం, 24 జులై 2021 (22:48 IST)
క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం చేరకుండా చేస్తుంది. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి.
 
ఒక గాజు సీసాలో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలు, చెంచా అల్లం తరుగూ, కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె వేసి మూత పెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగితే జీర్ణ సంబందిత సమస్యలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు దృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా క్యారెట్ రసాన్ని మించింది లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్థంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుంటే?