Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కాలం.. బొప్పాయిలో బోలెడు ప్రయోజనాలు.. వ్యాధినిరోధక శక్తి కోసం?

Advertiesment
Papaya
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ఆయుర్వేదం ప్రకారం ఆహారపు అలవాట్లలో జనం మార్పులు చేసుకున్నారు. తేనె, అల్లం, మిరియాలు అంటూ ఆహారంలో ఈ పదార్థాలను భాగం చేసుకుంటున్నారు. అలాగే బొప్పాయిని కూడా కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలో ఆహారంలో భాగం చేసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
బొప్పాయిలో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి, బి, ఈ, కే, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లెమ్యాటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ట కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగపడతాయని వారు చెప్తున్నారు. 
 
బొప్పాయి పండు జీర్ణశక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది. ఎందుకంటే.. అత్యధిక రోగ నిరోధక కణాలన్నీ ఆంత్రము లేదా పెద్ద, చిన్న పేగుల్లోనే ఉంటాయి. బొప్పాయి వల్ల అవి ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లేదా నీకంటూ ఓ అభిప్రాయం.. ఓ అర్థాంగి