Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొద్దస్తమానం ఏసీ గదుల్లో వుంటే?

పొద్దస్తమానం ఏసీ గదుల్లో వుంటే?
, బుధవారం, 4 డిశెంబరు 2019 (22:08 IST)
పొద్దస్తమానం ఏసీల్లో వుండటం ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఏసీలో ఉండడం వలన ప్రయోజనాల కంటే కూడా నష్టాలే ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. ఏసీ గదిలో చల్లదనం బయటికి వెళ్లకుండా ఉండేందుకు తలుపులు వేసేస్తారు. దీంతో ఆ గదిలో మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు పెరిగి, ఆక్సిజన్ తక్కువవుతుంది. 

దీనివలన వారికు తలనొప్పు సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్ సరఫరా లేనందువల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఒకింత తగ్గుతుంది. దీంతో ఏసీలో చాలా సేపు ఉన్నవారికి బాగా ్లసిపోయినట్లుగా అనిపిస్తుంది.
 
ఎసీలో ఎక్కువ సమయం ఉండేవారికి దాహం అనిపించదు. దీంతో రోజుకి తాగాల్సిన నీళ్ల కంటే తక్కువ మోతాదులో తాగడం వలన కిడ్నీలో రాళ్ల సమస్యలు త్వరితంగా ఏర్పడతాయి. ముఖ్యంగా ఏసీ ఉన్న వారికి శ్వాసకోస సంబంధిత సమస్యలు అధికంగా వస్తాయి. ఇదేవిధంగా ఆస్తమా, లో బీపీ, చర్మం పొడిబారిపోవడం వంటి పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. 
 
ఏసీలో ఎక్కువ సమయంలో ఉండేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలి తగిలే విధంగా బయటకు వస్తూ ఉండాలి. మధ్యాహ్నం పూట బాగా వేడిగా ఉన్న సమయంలో ఏసీ గదిలో నుంచి అకస్మాత్తుగా బయటకు రాకూడదు. కాస్త చల్లబడిన తర్వాత సాయంత్రం మాత్రంమే బయటకు రావాలి. తప్పనిసరిగా ఏసీలోనే ఉండాల్సి వచ్చినప్పుడు శరీరానికి మాయిశ్చరైజింగ్ క్రీములు ఉపయోగించాలి. లేదంటే చర్మం పొడిబారిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లటి వలయాలు కంటి కింద అందాన్ని అపహాస్యం చేస్తున్నాయా?