Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చలికాలంలో ధనియాలతో మేలెంతో..

చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం జలుబును నయం చేస్తుంది. ధనియాలను గ్లాసు నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజువారీ ఆహారంగా తీసుకుంటే ర

చలికాలంలో ధనియాలతో మేలెంతో..
, సోమవారం, 22 జనవరి 2018 (12:20 IST)
చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం జలుబును నయం చేస్తుంది. ధనియాలను గ్లాసు నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజువారీ ఆహారంగా తీసుకుంటే రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. మధుమేహం రాకుండా అడ్డుకోవడంలో ధనియాలు అద్బుతంగా పనిచేస్తాయి. 
 
టైఫాయిడ్‌కు ధనియాలు విరుగుడిగా పనిచేస్తుంది. సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియాతో ఏర్పడే టైఫాయిడ్‌ను ధనియాలు దూరం చేస్తాయి. ధనియాల పొడి, పసుపును పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
 
ఇంకా ఒబిసిటీని ధనియాలు దూరం చేస్తాయి. రక్తనాళల్లో కొవ్వు పెరుకుపోవడాన్ని, గుండెకు మేలు చేయడాన్ని ఈ కొలెస్ట్రాల్ కారణంగా గుండెకు రక్తసరఫరా సరిగా జరగదు. దీనికి ధనియాలతో చెక్ పెట్టొచ్చు. రెండు చెంచాల ధనియాలను తీసుకొని పొడర్ గా చేసి, ఒక గ్లాస్ నీటిలో కలపాలి. ఆ నీటిని వేడి చేసి తీసుకుంటే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురిటి నొప్పుల సమయంలో డ్యాన్స్...