Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

papaya leaves

సిహెచ్

, బుధవారం, 11 సెప్టెంబరు 2024 (18:53 IST)
డెంగ్యూ జ్వరం. ఈ జ్వరం వచ్చిందని అనగానే చాలామంది వెంటనే ఆశ్రయించేది బొప్పాయి ఆకులను. వీటి రసాన్ని తాగితే రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవని నిపుణులు చెబుతారు. ఐతే కొంతమంది డెంగ్యూ వచ్చిందని తెలియగానే వెంటనే రోగికి గ్లాసులకొద్దీ బొప్పాయి రసాన్ని తాగిస్తుంటారు. ఇలా చేయకూడదు. వైద్యుల సూచన మేరకు మాత్రమే చేయాలి. గ్లాసులకొద్ది బొప్పాయి ఆకుల రసం జీర్ణ సంబంధ సమస్యలను తెస్తుంది. ఫలితంగా విరేచనాలు ప్రారంభమవుతాయి. ఉన్న జబ్బును తగ్గించుదామని అనుకుంటే కొత్త జబ్బు పట్టుకుంటుంది. కనుక చాలా జాగ్రత్తగా వుండాలి.

బొప్పాయి ఆకు రసం చాలా చేదు రుచిని కలిగి ఉంటుంది. ఇది తాగిన తర్వాత, మీరు రోగికి రుచిని మెరుగుపరచడానికి కొంచెం బెల్లం లేదా చిటికెడు పంచదార ఇవ్వవచ్చు. బొప్పాయి ఆకుల రసాన్ని ఎలా తాగవచ్చు... ఎంత తాగవచ్చు అంటే.. పెద్దలకు, అల్పాహారానికి ముందు 30 మి.లీ బొప్పాయి రసం, మధ్యాహ్న భోజనానికి ముందు 30 మి.లీ, రాత్రి భోజనానికి ముందు 30 మి.లీ తాగవచ్చు. అదే పిల్లలకయితే 5 నుండి 10 ml బొప్పాయి రసం ఇవ్వవచ్చు, అయితే ఇది ఖచ్చితంగా వైద్య పర్యవేక్షణలో చేయాల్సి వుంటుంది.

ప్రతిరోజూ ఈ రసాన్ని తాజాగా సిద్ధం చేసుకోవాలి. దీన్ని 24 గంటల కంటే ఎక్కువ నిల్వ చేయకూడదు. ఈ రసాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో ఫ్రిజ్‌లో ఉంచాలి. చాలా చల్లగా ఉండకుండా ఉండటానికి ఫ్రిజ్ దిగువ భాగంలో నిల్వ చేయండి. బొప్పాయి ఆకుల రసం వినియోగంతో రెండవ రోజు నుంచే ప్లేట్‌లెట్ కౌంట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుందని చెబుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు