Publish Date: Sat, 20 Sep 2008 (11:58 IST)
Updated Date: Sat, 20 Sep 2008 (11:57 IST)
ప్రశ్నలు :
1. ప్రచేతసుని తండ్రి ఎవరు?
2. బ్రహ్మ పురాణం ప్రకారం కశ్యపుడు దక్షుని కుమార్తెలెంతమందిని పెళ్లి చేసుకున్నాడు?
3. నవబ్రహ్మ ఆలయాలు ఏ దేవుడివి?
4. నాగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు?
5. హర్యశ్వులు ఎంతమంది?
6. యుద్ధంలో రావణుడు స్వయంగా లంక ఏ ద్వారాన్ని రక్షిస్తూ ఉన్నాడు?
7. అఘనాశిని నది ఏ రాష్ట్రంలో ఉంది?
8. స్థిరములలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపాడు?
9. నవబ్రహ్మ ఆలయాలు మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి?
10. రాబోయే ఏడుగురు మనువులలో ఐదుగురు ఏ మనువులు అవుతారు?
జవాబులు :
1. ప్రాచీనబర్హి
2. పదమూడు
3. శివుడు
4. అనంతుడు-శేషు
5. ఐదువేలు
6. ఉత్తర ద్వారం
7. కర్ణాటక
8. హిమాలయం
9. అలంపురం
10. సావర్ణి