Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా ఎఫెక్ట్‌తో దిగాలు పడ్డ ఆక్వారంగం..

కరోనా ఎఫెక్ట్‌తో దిగాలు పడ్డ ఆక్వారంగం..
, మంగళవారం, 21 జులై 2020 (19:45 IST)
కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని రంగాలు మూలన పడుతున్నాయి. ఇక ఆక్వా రంగం అయితే కరోనా దెబ్బకు కుదేలు అవుతోంది. రొయ్యల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది.  విశాఖ ఫిషింగ్ హార్బర్లో రొయ్యలు ఎగుమతికి జాతీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదొడుకుల కారణంగా ఆక్వా ఎగుమతి ఆర్డర్లు రద్దు అవుతున్నాయి. దీంతో సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు, ఇటు వ్యాపారులు, రైతులు అమ్మకాలు లేక నష్టాలు చవిచూస్తున్నారు.
 
ముఖ్యంగా రొయ్యల్లో మంచి ధర పలికే లోబ్ స్టార్ వంటివి హార్బర్‌కే పరిమితమవుతున్నాయి. దీంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడి రొయ్యల ధరలు 50 శాతం పడిపోయాయి. కరోనాకు ముందు టైగర్, లోబ్ స్టార్ వంటి రొయ్యలు కిలో రూ. 1200 వరకూ పలికేవి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రతిరోజూ వేలాది టన్నుల రొయ్యలు వివిధ రాష్ట్రాలకు... ముఖ్యంగా అసోం, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండేవి.
 
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాలు రొయ్యలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. విశాఖ హార్బర్ నుంచి చైనా, దక్షిణ కొరియా, జపాన్‌, దుబాయ్‌, ఖతార్‌, అమెరికా, యూరోపియన్‌ దేశాలకు కంటైనర్లలో ప్రాసెసింగ్‌ చేసిన రొయ్యలను ఎగుమతి చేసేవారు. జనవరిలో చైనాలో కరోనా విజృభించడంతో 30 శాతం ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. కోట్ల విలువైన ఉత్పత్తులు శీతలీకరణ గిడ్డంగుల్లో నిలిచిపోవడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
 
భారీగా రొయ్యల పంట చేతికి వస్తుండటంతో కొనుగోలుదారులు ధర భారీగా తగ్గించారు. పోనీ మంచి రేటు వచ్చిన తరువాత అమ్ముదామంటే శీతల గిడ్డంగులు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇలాగే కొనసాగితే అవి కుళ్లిపోయి మరింత నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగంపై దృష్టి సారించి మమ్ములను ఆదుకోవాలని అంటున్నారు ఆక్వా రంగంపై ఆధారపడిన వర్గాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు: గవర్నర్ బిశ్వభూషణ్