Article Finance Articles %e0%b0%b6%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 %e0%b0%b8%e0%b1%88%e0%b0%a4%e0%b0%82 %e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b0%a4%e0%b0%bf 108021400024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం సైతం పురోగతి

Advertiesment
నిఫ్టీ గురువారం శుక్రవారం సెన్సెక్స్ రిలయన్స్ పవర్
షేర్ మార్కెట్‌కు గురువారం శుభ దినంగా పరిణమించింది. ఆశాజనకమైన ట్రేడింగ్‌తో సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగింది. ఈ పెరుగుదల ప్రభావం రోజంతా కనిపించింది. గురువారంనాటి ట్రేడింగ్‌ను గమనించినట్లయితే మార్కెట్‌లు మదుపుదారులకు శుభవార్తలు మోసుకు వచ్చే దిశగా దూసుకుపోతున్నాయని అర్థమవుతోంది.

గురువారం నాడు 250 పాయింట్ల వద్ద నిఫ్టీ పెరుగుదల నిలిచిపోయింది. చూడబోతే ఈ పురోగతి శుక్రవారం సైతం కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం నాటి మార్కెట్ ప్రారంభంలో 40-50 పాయింట్ల వద్ద నిఫ్టీ కార్యకలాపాలు ప్రారంభం కానుంది. 5250-5260 మధ్య స్థిరమైన ట్రేడింగ్‌ను నిఫ్టీ చవి చూసే అవకాశం ఉంది. 5250-5260 వద్ద స్థిరత్వాన్ని పొందిన పక్షంలో నిఫ్టీ పెరుగుదలను గమనించవచ్చు.

నిఫ్టీకి 5120/5050/5025 స్థాయీల వద్ద మంచి మద్దతు లభించవచ్చు. అదేసమయంలో నిఫ్టీ 5350 స్థాయిని చేరుకున్నట్లయితే నిఫ్టీ 54000 స్థాయిని స్పశించే అవకాశం ఉంది.

శుక్రవారం నాటి ప్రముఖ స్టాకులు: శుక్రవారం నాటి మార్కెట్‌లో రిలయన్స్ పవర్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, రిలయన్స్ ఇండియా, జేపీ హైడ్రో, ఐసీఐసీఐ బ్యాంక్, అన్సాల్ ఇన్‌ఫ్రా, ప్రజ్ ఇండ్, హిందూ పెట్రోలపై ఆసక్తి గలవారు తమ దృష్టిని కేంద్రీకరించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu