Publish Date: Fri, 14 Mar 2008 (15:35 IST)
Updated Date: Fri, 14 Mar 2008 (15:34 IST)
కావలిసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ - కప్పు, నెయ్యి - పావు కప్పు, నీళ్లు - రెండున్నర కప్పులు, యూలకులు - మూడు, మైదా - ఒకటిన్నర కప్పులు.
తయారు చేయు విధానం :
ముందుగా మైదా పిండిలో నీళ్లు పోసి నూనె వేసి కలిపి గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. దానిని కాసేపు నాననిస్తుండాలి. బాణాలిలో కాస్త నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. ఓ గిన్నెలో నీళ్లు పోసి కాచాలి. అలి కాగాక అందులో వేయించిన బొంబాయి రవ్వను వేసి మాట కుండా తిప్పుతూ ఉడికించాలి. ఇందులో కావలిసినంత పంచదార, నెయ్యి, యాలకులను పొడి చేసి వేయాలి. ఇవన్నీ కలిసి ముద్దయ్యేంత వరకు ఉంచి దించేయాలి.
ఆ తర్వాత ఆరబెట్టి చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరో వైపు బాణాలిలో నూనె వేసి కాచాలి. చేతికి కాస్త నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మైదాపిండిని చేతితో గుండ్రంగా చేయాలి. ఇందులో ఆ బొంబాయి రవ్వ ఉండను పెట్టి పైన మూసి ప్లాస్టిక్ కవర్పై పెట్టి గుండ్రంగా ఒత్తి కాగిన నూనెలో వేయించి దించాలి.