Publish Date: Tue, 19 Aug 2008 (18:41 IST)
Updated Date: Tue, 19 Aug 2008 (18:41 IST)
కావలసిన పదార్థాలు :
శనగపిండి... పావు కేజీ
కారం... ఒక టీస్పూను
ఉప్పు... ఒక టీస్పూను
వాము... ఒక టీస్పూను
జీలకర్ర... ఒక చెంచా
నూనె... పావుకేజీ
తయారీ విధానం :
శనగపిండి తాజాది తీసుకుని జల్లెడపట్టి, ఒక పళ్ళెంలో పోసి దానికి ఉప్పు, కారం, మెత్తగా నూరిన వాము, జీలకర్ర మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా వెన్న లేదా నెయ్యి వేసి నీళ్ళు చల్లుతూ పిండిని గట్టిగా కలుపుకుని ఉంచుకోవాలి. తరువాత కళాయి పొయ్యిమీద పెట్టి పావుకేజీ నూనె పోసి బాగా మరగబెట్టి మురుకుల గొట్టాములో అన్నింటికన్నా కన్నాలు సన్నగా ఉన్న బిళ్లను తీసుకొని కొద్ది కొద్దిగా పిండి పెట్టి మరిగే నూనెలో పిండుకొని మంచి రంగు వచ్చాక తీసేయాలి. బాగా ఆరిన తరువాత వాటిని గాలిదూరని డబ్బాలో పోసుకుని నిల్వచేసుకోవాలి.