Publish Date: Fri, 11 Apr 2008 (10:37 IST)
Updated Date: Fri, 11 Apr 2008 (10:36 IST)
కావలసిన పదార్థాలు :
శనగపప్పు - రెండు కప్పులు, మినపప్పు - కప్పు, కందిపప్పు - కప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, జీలకర్ర - చిటికెడు, నూనె - నాలుగు కప్పులు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉల్లిపాయలు - రెండు, కారం - చిటికెడు.
తయారు చేయు విధానం :
ముందుగా శనగపప్పును విడిగా నానబెట్టాలి. అలాగే మిగిలిన పప్పులు కూడా నాలుగైదు గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగి శనగపప్పును సగం మాత్రమే తీసుకుని మిగతా పప్పులు, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి.
తర్వాత ఇందులో తరిగిన ఉల్లిముక్కలు, నలిపిన కర్వేపాకును ఉప్పు, జీలకర్ర, కారంలను ఈ పిండిలో వేసి కలపాలి. తర్వాత మిగిల్చిన శనగపప్పును కూడా ఇందులో వేసి కలిపి పెట్టుకోండి. బాణాలి పెట్టి నూనె వేసి కాగాక, కవరుపై నూనె రాసి దానిపై రుబ్బిన పిండిని గారెల్లాగా చేసి వేసి బంగారు వన్నెవచ్చేంత వరకు వేయించి దిం