Publish Date: Fri, 14 Mar 2008 (15:25 IST)
Updated Date: Fri, 14 Mar 2008 (15:25 IST)
కావలిసిన పదార్థాలు :
బంగాళదుంపలు - అర కిలో, బియ్యపు పిండి - ముప్పావు కిలో, కారం - సరిపడ, ఉప్పు - సరిపడ, నువ్వులు - 25 గ్రాములు, నూనె - వేయించడానికి సరిపడ, డాల్డా - 100 గ్రాములు.
తయారు చేయు విధానం :
ముందుగా ఆలూను ఉడికించి తొక్కలు తీసి చేత్తో మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలి. బియ్యపు పిండిలో మెత్తగా చేసుకున్న ఆలూ, నువ్వులు, వాము, కారం, ఉప్పు, డాల్డాలను వేసి కలపాలి. బాణాలిలో నూనె వేసి కాచాలి. ఆ తర్వాత చక్రాల గిద్దెలను తీసుకుని అందులో ఆలూ మిశ్రమాన్ని పెట్టి, చక్రాలుగా వేసుకోవాలి. వేగాక దించి సర్వ్ చేయాలి.