Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

Advertiesment
India

సెల్వి

, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (13:10 IST)
India
2000 పుట్టగానే కలియుగం ముగుస్తుందని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏది జరగలేదు. ఎన్నో ప్రకృతీవైపరీత్యాలు ఏర్పడినా.. యుగాంతం జరగలేదు. కానీ విధ్వంసకరమైన ఘటనలు ప్రపంచ దేశాల్లో అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అయితే తాజాగా ఓ భయంకరమైన వార్త ప్రజలను వణికిస్తోంది. 
 
2032 యుగాంతం కానుందని.. భారత్‌పై ఏకంగా 500 అణుబాంబుల వర్షం కురిస్తుందని ఓ వార్త భయాందోళనలను సృష్టిస్తోంది. డిసెంబర్ 22న యుగాంతం జరుగుతుందని కూడా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ యుగాంతానికి ఓ ఉల్క కారణమవుతుందని వార్తలు వస్తున్నాయి. 
 
గంటకు 60వేల కిలోమీటర్ల వేగంతో ఒక భారీ ఉల్క భూమివైపు దూసుకొస్తోంది. ఈ ఉల్క ఎంత శక్తివంతమైందంటే.. ఒక పెద్ద నగరాన్ని క్షణాల్లో నాశనం చేయగలదు. ఈ ఉల్క భూమివైపుకు దూసుకురావడంపై అంతరిక్ష పరిశోధన సంస్థలన్నీ ఆందోళన చెందుతున్నాయి. 
 
ఈ ఉల్కకి 2024 YR4 అనే పేరు కూడా పెట్టేశారు. ఈ ఉల్క ప్రస్తుత స్థానాన్ని బట్టి ప్రమాద పటాన్ని నాసాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ రాంకిన్ అనే ఇంజనీర్ సిద్ధం చేశారు. దీనిని బట్టి భారతదేశంపై ఈ ఉల్క పడే అవకాశం వుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఉల్క ప్రభావం భారత్‌, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా, సూడాన్, నైజీరియా, కొలంబియా, ఈక్వెడార్ వంటి దేశాలపై వుండే అవకాశం వుంది. 
 
2032లో ఈ 2024 YR4 ఉల్క భూమిని ఢీకొడితే ఆఫ్రికా ఖండంలోకి ప్రాంతాలు, ఉత్తర, దక్షిణ అమెరికా నుంచి ఫసిఫిక్ సముద్రంపై ప్రభావం వుంటుంది. డిసెంబర్ 22, 2032న ఈ ఉల్క భూమిని ఢీకొట్టే అవకాశం వుందని నాసా అంచనా వేస్తుంది. సముద్రంలోనే ఈ ఉల్క పడినా.. జనావాస ప్రాంతాల్లో ఎక్కడైనా పడితే మాత్రం భారీ విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఉల్క ప్రభావం 500 అణుబాంబులకు సమానం. ఇంకా 8 మెగాటన్నుల టీఎన్టీ పేలిన శక్తి విడుదలవుతుంది. ఇది హీరోషిమా మీద వేసిన అణుబాంబు కంటే 500 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. దీనిని 2024 డిసెంబరులో గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?