Publish Date: Thu, 14 Mar 2024 (22:17 IST)
Updated Date: Thu, 14 Mar 2024 (22:19 IST)
శుక్రవారాలు సాధారణంగా సినిమా విడుదల కోసం బుక్ అవుతూ వుంటాయి. కానీ రేపు, శుక్రవారం, మార్చి 15 ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ రోజు భారత రాజకీయాల్లో కీలకంగా మారనుంది. దేశ రాజకీయాల్లో ఆరింటి కంటే కీలకమైన నిర్ణయాలను మార్చి 15న తీసుకోనున్నారు.
దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామకం కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన మద్యం కుంభకోణం కేసును సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది.
శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించడంతో పాటు కొత్త సభ్యులు పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఏపీలో వివేకా కుటుంబం "ఆత్మీయ సమావేశం"కు ఏర్పాట్లు చేస్తుండగా.. డాక్టర్ సునీత్ రెడ్డి సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఈ శుక్రవారం సంచలనాత్మక ప్రకటనలు విడుదల కానున్నాయి. సో.. ఇది దేశ రాజకీయాల్లో కీలకమైన రోజుగా పరిగణింపబడుతోంది.