Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

Advertiesment
victim woman

ఠాగూర్

, బుధవారం, 2 ఏప్రియల్ 2025 (11:45 IST)
రాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ జంట... భార్యాభర్తలు కాదని తెలుసుకున్న ఏడుగురు నిందితులు పురుషుడుని కట్టేసి.. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం, ఉర్కొండ గ్రామ శివారు ప్రాంతంలో జరిగింది. మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‍‌తో కలిసి మంగళవారం అత్యాచార ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్భంగా ఐటీ సత్యనారాయణ మాట్లాడుతూ, అత్యాచానికి పాల్పడిన ఏడుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు. నిందితులు గతంలో ప్రేమికులను, మైనర్లను బెదిరించి డబ్బులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. 
 
అయితే, ఈ అత్యాచార ఘటనకు సంబంధించి, గత శనివారం రాత్రి దాదాపు 10.30 గంటలకు ఓ జంట ద్విచక్రవాహనంపై రావడాన్ని నిందితుల్లో నలుగురు గమనించారు. ఆ జంట ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించిన నలుగురు... ఫోన్ చేసి మరో ముగ్గురిని పిలిపించారు. ఆ తర్వాత జంట భార్యభర్తలు కాదని తెలుసుకుని మహిళతో పాటు వచ్చిన వ్యక్తిని కట్టేసి ఆదివారం ఉదయం దేవాలయం ముందు నుంచి భూత్పూర్ మండలంలోని తమ  సొంత గ్రామానికి వెళుతుండా నిందితుల్లో ఒకరైన మహేశ్ గౌడ్ గమనించారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే మీ వ్యవహారం బయటపెడతామని బెదిరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య