Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మహిళ.. ఎక్కడ?

victim
, ఆదివారం, 29 మే 2022 (17:41 IST)
ఆమె కూడా తనలాంటి ఆడదే అనే విషయాన్ని మరిచిపోయిన ఓ మహిళ.. ఓ యువతిపై అత్యాచారం చేయించింది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొండాపూర్ శ్రీరాంనగర్‌లో భర్తతో కలిసి ఓ మహిళ నివాసం ఉంటోంది. అదే కాలనీలో ఉండే యువతితో మహిళ భర్తకు పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటుండే వారు. ఇది చూసిన ఆ మహిళ ఇద్దరిపై అనుమానం పెంచుకొని.. పైశాచిక కుట్రకు పథకం వేసింది. 
 
ఈ నెల 26న మాట్లాడాలి రమ్మంటూ యువతిని శ్రీరాంనగర్‌లోని తన ఇంటికి పిలిచి.. ఇంట్లోని బాత్‌రూంలో బంధించింది. ఆ తర్వాత యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నలుగురు యువకులను పిలిపించి వారితో యువతిపై దాడి చేయించింది.
 
ఆ నలుగురు యువతిపై అత్యాచారయత్నం చేయడంతో పాటు పైశాచికంగా హింసించారు. యువతి ప్రైవేట్ భాగాలపై దాడి చేశారు. ఈ మొత్తాన్ని సదరు మహిళ ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది.
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలో విషాదం.. పెరుగుతున్న మృతులు