Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

Advertiesment
crime

ఐవీఆర్

, శనివారం, 24 మే 2025 (16:03 IST)
మొండి యువతిని నాకు భార్యను చేసావ్, నువ్వు చావాల్సిందేనంటూ పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని హత్య చేసాడు ఓ యువకుడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలో మంగుళూరుకు చెందిన 50 ఏళ్ల సులేమాన్ 8 నెలల క్రితం 30 ఏళ్ల ముస్తఫాకు ఓ మహిళతో వివాహం కుదిర్చాడు. ఐతే వివాహం అయిన దగ్గర్నుంచి భార్యాభర్తలు పిల్లి-ఎలుకల్లా కీచులాడుకుంటూనే వున్నారు. ప్రతి చిన్న విషయానికి భర్త విసిగిస్తున్నాడంటూ ముస్తఫాను వదిలేసి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఎంత బ్రతిమాలినా తిరిగి రానంటే రానని చెప్పేసింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ముస్తఫా నేరుగా తన పెళ్లి కుదిర్చిన సులేమాన్ ఇంటికి వెళ్లాడు. మొండి యువతిని తనకు భార్యగా చేసావంటూ అతడిపై వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి సులేమాన్ మెడపై కత్తితో పొడిచేసాడు ముస్తఫా. దీనితో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన సులేమాన్ ఇద్దరు కొడుకులపై కూడా ముస్తఫా దాడి చేసాడు. వీరిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్