Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది

ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:04 IST)
భర్త నిత్యం బిజీబిజీ అంటూ తిరుగుతూ ఉంటాడు. పని మీదే ఎప్పుడూ ధ్యాస. భార్యను పట్టించుకోవడం లేదు. పెళ్ళయి రెండేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో ఆ వివాహిత పక్కదారి పట్టింది.
 
గుజరాత్ లోని వడోదరాలో జరిగిన ఘటన. వడోదరాలో నివాసముండే కామినికి మూడేళ్ళ క్రితం సోహన్ అనే వ్యక్తితో వివాహమైంది. సోహన్ మార్కెటింగ్ మేనేజర్. పనుల నిమిత్తం వారంరోజుల్లో నాలుగురోజుల పాటు బయటి ప్రాంతాల్లోనే ఉండేవాడు. డబ్బులు సంపాదించడంపైనే అతడి ధ్యాస.
 
దీంతో భార్యను పూర్తిగా మర్చిపోయాడు. పెళ్ళయినప్పటి నుంచి తనతో సరిగ్గా గడపడం లేదంటూ.. తన కోర్కెలు తీర్చడం లేదంటూ ఆవేదనకు గురయ్యేది భార్య. దీంతో పేపర్ వేసే దిలీప్ అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది.
 
భర్త లేని సమయంలో దిలీప్‌తో సరససల్లాపాల్లో మునిగితేలేది. అందుకు తన ఇంటినే వేదికగా చేసుకుంది. అయితే తన ఇంటికి సమీపంలోని వారు సోహన్‌కు విషయం చెప్పినా నమ్మలేదు. ఒకరోజు ఇంటికి వచ్చిన సోహన్ దిలీప్‌ను ఇంటిలో చూసి షాక్ తిన్నాడు.
 
భార్యను చితకబాదాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తపైనే వేధింపుల కేసు పెట్టింది భార్య. దీంతో పోలీసులు ఇద్దరి మీద కేసులను నమోదు చేసి విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థత