Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేసామని చెప్తావా అంటూ మరోసారి రేప్ చేసిన వ్యక్తులు

Advertiesment
rape
, మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:47 IST)
ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మాపైనే కేసు పెడతావా అంటూ మరోసారి అత్యాచారం చేసారు. మరోవైపు పోలీసులు సైతం తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే తగాదా జరిగిందని కేసు నమోదు చేసుకున్నారని బాధితురాలు వాపోయింది.

 
హిందూపురంలో ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటికి సమీపంలో తగాదా జరిగింది. ఈ క్రమంలో మహిళపై కక్ష పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు ఎవరూ లేని సమయంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గత మే నెలలో జరిగింది. దీనితో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు తగాదా కేసు కింద నమోదు చేసుకుని బాధితురాలిని పంపేసారు.

 
విషయం తెలుసుకున్న నిందితులు.. మహిళ ఇంట్లోకెళ్లి భౌతిక దాడి చేసి మరోసారి సామూహిక అత్యాచారం చేసారు. దీనితో భయపడిపోయిన బాధితురాలు తన మకాం బెంగళూరుకు మార్చేసుకుంది. ఐతే అప్పటికీ వారు ఆమెను వదలకుండా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారంటూ జిల్లా ఎస్పీ ముందు కన్నీటిపర్యంతమైంది బాధితురాలు. నిందితులను అరెస్టు చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బైఠాయించింది. మరోవైపు నిందితులకు ఓ పార్టీ మద్దతు పుష్కలంగా వుందనీ, అందువల్ల వారిపై కేసులు పెట్టేందుకు కూడా పోలీసులు భయపడుతున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాషాయ కండువా కప్పుకోనున్న జయసుధ?