Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Advertiesment
murder

ఠాగూర్

, మంగళవారం, 15 జులై 2025 (09:38 IST)
ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేశాడో కుమారుడు. తాడికొండ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన వేల్పూరి శివయ్య (57) అనే వ్యక్తి ఈపూరు మండలం పొనుగోటివారి పాళెంలోన ఓ కోళ్లఫారంలో పనిచేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు నరేంద్ర, ఓ కుమార్తె ఉంది. కుమారుడుకి వివాహమైంది. ఆ తర్వాత కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. దీంతో శివయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 
 
అప్పుడప్పుడూ గ్రామంలోని తల్లిని చూసేందుకు వస్తుంటారు. ఈ నెల 9న రాత్రి 8.30 సమయంలో గ్రామంలోనే వేరుగా ఉంటున్న భార్య, పిల్లల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన పేరుపై ఉన్న 1.40 ఎకరం భూమి విషయంలో నరేంద్ర గొడవకు దిగాడు. ఆస్తి తనకు రాయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. 
 
ఆ తర్వాత నిద్రిస్తున్న తండ్రిని గొంతు నులిమి హతమార్చాడు. నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కాగా శివయ్య అనుమానాస్పద మృతిపై తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..