Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

Advertiesment
couple

ఐవీఆర్

, శనివారం, 24 మే 2025 (13:09 IST)
ఈమధ్య కాలంలో రోడ్లపై ద్విచక్ర వాహనాలపై వెళుతూ కొన్ని జంటలు లైంగిక చర్యను చేస్తున్నారు. వీటిని రహదారులపై వెళ్లేవారు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపైన ఓ జంట రాసలీల చేయడం సీసీ కెమేరో రికార్డయ్యింది. అది కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
 
ఈ కామక్రీడలో పాల్గొన్న వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్సార్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ రాసక్రీడ మే 13న రికార్డు అయినట్లు తేలింది. ఈ వ్యక్తి భాజపాకి చెందినవాడని విపక్షాలు గోలపెడుతున్నాయి. దీనిపై స్పందించిన భాజపా అతడు తమ పార్టీకి చెందిన వాడు కాదంటూ వెల్లడించింది. ఐతే ధాకడ్ భార్య భాజపా మద్దతు తెలిపిన జిల్లా పంచాయతీ సభ్యురాలిగా వుంది.
 
కాగా ధాకడ్‌తో పాటు రహదారిపై లైంగిక చర్యలో పాల్గొన్న మహిళపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై వీరిద్దరూ రాసక్రీడలో పాల్గొన్నట్లు తేలిందనీ, ఈ చర్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్గించేది కనుక వారిపై సెక్షన్ 296 కింద కేసు నమోదు చేసినట్లు డిఐజి మనోజ్ కుమార్ తెలియజేసారు. ఈ వీడియో బైటకు వచ్చిన దగ్గర్నుంచి ధాకడ్ ఫోన్ స్విచాఫ్‌లో వున్నది. అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?