Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కౌన్సిలింగ్‌ ఇస్తానని ఇంటికి పిలిచి బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం

కౌన్సిలింగ్‌ ఇస్తానని ఇంటికి పిలిచి బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం
, మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కౌన్సిలింగ్ పేరుతో ఓ బాలికను తన ఇంటికి పిలిచిన హైడ్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తామని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత బాలిక తండ్రిని పక్కనే ఉన్న ఓ షాపుకు పంపించి, బాలికపై అత్యాచారనికి ఒడిగట్టాడు. 
 
ఆ బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో బాలికపై అత్యాచారం చేసినట్టు తేలడంతో హెడ్ కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృతి చెందిన వృద్ధుడు... గంగాజలం నోట్లో పోయగానే కళ్లు తెరిచాడు.. ఎక్కడ?