Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిశ్చితార్థం జరగాల్సింది. కానీ.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Advertiesment
engagement
engagement
నిశ్చితార్థం జరగాల్సింది. కానీ ఆ వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఖమ్మంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దులపల్లి గ్రామానికి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్ (పెయింటర్) మంగళవారం రాత్రి జరిగి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రసాద్ మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణా షాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న సీఐ ముష్కరాజు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గురువారం ప్రసాద్‌కు నిశ్చితార్థం జరగాల్సి వుండగా.. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు టిక్కెట్ల రద్దు, రీఫండ్ విధానంలో కీలక మార్పులు.. ఏంటవి?