Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

120 మంది మహిళలను అత్యాచారం చేసిన జిలేబీ బాబా... ఎలా?

jilebi baba
, గురువారం, 12 జనవరి 2023 (12:56 IST)
హర్యానా రాష్ట్రంలో జిలేబీ బాబాగా గుర్తింపు పొందిన అమర్ వీర్ (63) అనే కీచకుడు ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ మళ్లీ అత్యాచారాలు చేశాడు. ఈ వీరందరికీ మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కోర్టు విచారణలో తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అమీర్‌కు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నాయి. భార్య చనిపోయింది. 23 యేళ్ల కిందటే పంజాబ్‌లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహానాకు వలస వచ్చాడు. 13 యేళ్ల పాటు అతడు ఓ జిలేబీ దుకాణం ప్రారంభించాడు. ఆ సమయంలో ఓ తాంత్రికుడితో పరిచయం ఏర్పడింది. అది అతని జీవితాన్ని మలుపుతిప్పింది. 
 
క్షుద్రపూజలపై ఆసక్తి చూపాడు. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిండా. కొన్నాళ్ల తర్వాత తిరిగివచ్చి ఓ ఆలయం, దాని పక్కనే ఇల్లు నిర్మించాడు. అక్కడ నుంచి ఆయన తనను బాబాగా ప్రచారం చేస్తూ పలువురు భక్తులను తయారు చేసుకున్నాడు. వారిలో చాలామంది మహిళలే కావడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన జిలేబీ బాబాగా స్థిరపడిపోయాడు. 
 
ఈ క్రమంలో గత 2018లో ఓ పరిచయస్తుడి భార్యపై గుడిలో అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా తన అఘాయిత్యాలకు వీడియో తీసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారాలకు పాల్పడసాగాడు. ఈ క్రమంలో ఆయనకు బెయిల్ లభించింది. అయితే, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అతడి పాపం పండింది. కోర్టులో అతడి నేరాలు నిరూపితమయ్యా. దీంతో ఆయనకు 14 యేళ్ల కోర్టు జైలుశిక్ష విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ హాల్ టిక్కెట్లు విడుదల ..