Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అమ్మకు సారీ చెప్తేనే ఇంటికి వస్తానన్న భర్త... ఆత్మహత్య చేసుకున్న భార్య

Advertiesment
suicide

ఠాగూర్

, శుక్రవారం, 12 జనవరి 2024 (15:24 IST)
తన అమ్మను క్షమాపణలు కోరితేనే ఇంటికి వస్తానని భర్త భీష్మించి కూర్చోవడంతో మనస్తాపం చెందిన ఇల్లాలు ఇంట్లోనే ఉరేసుకున ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సూరారం ఆర్జేకే కాలనీకి చెందిన ఎస్కే ఫర్జానా (35), ఎక్సే ఖదీర్ వలీ అనే దంపతులు ఉన్నారు. వీరికి 2011లో వివాహమైంది. అయితే, మద్యానికి బానిస అయిన ఖదీర్ వలీ.. గత కొంతకాలంగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్త మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కుమార్తెకు స్కూలు ఫీజు చెల్లించే విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త ఖదీర్ వలీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత భర్తకు ఫర్జానా వీడియో కాల్ చేసి ఎక్కడ ఉన్నప్పటికీ ఇంటికి రావాలంటూ ప్రాధేయపడింది. అయితే, తన తల్లికి సారీ చెప్తేనే తాను వస్తానన తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన ఫర్జానా ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దంపతులకు గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో తీవ్ర చలి.. 36మంది పిల్లలు మృతి