Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్కొండలో దారుణం : నగ్న చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్ - నెల రోజులుగా...

Advertiesment
Hyderabad
, ఆదివారం, 7 నవంబరు 2021 (17:14 IST)
హైదరాబాద్ నగరంలోని గోల్కొండలో దారుణం జరిగింది. ఒక యువతిపై కొందరు కామాంధులు నెల రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి నగ్న ఫోటోలు చూపించి ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలెనగర్‌ కంచెకు చెందిన ఓ మహిళ (28) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక ఇంటిలో అద్దెకు ఉంటోంది. ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమెను కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఉండే ఎకాత్తాతూ అనే వ్యక్తితో పరిచయమైంది. 
 
అయితే ఏకాత్తతూ తన ఇద్దరు స్నేహితులతో కలిసి అమె ఇంట్లోకి చొరబడి కాళ్లు, చేతులు బందించి గన్‌తో బెదిరించి షాహిన్ నగర్‌కు తీసుకెళ్లి అమెపై అత్యాచారం చేశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అపై తన అశ్లీల వీడియోలు తీసి బెదిరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ బంధించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. ఫొటోలు కూడా తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేశాడు.
 
కాగా, ఈ ఘటనపై గత వారం రోజులుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. ఎవరికైనా విషయం చెబితే ప్రాణాలు తీస్తామని అని బెదిరించడంతో నెల రోజుల నుండి ఎవరికీ చెప్పుకో లేదని తెలిపింది. 
 
బాధితురాలు సంఘటన జరిగిన నాటి నుంచి మనోవేదనకుగురై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్.. ఉచిత విద్యుత్