Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైబర్ మోసగాళ్ల మోసం.. రూ.41.49 లక్షలు స్వాహా.. పెట్రోల్ పంప్ పేరిట?

cyber crime

సెల్వి

, మంగళవారం, 23 జనవరి 2024 (10:19 IST)
సైబర్ మోసగాళ్ల మోసం మరోసారి తెరపైకి వచ్చింది. పెట్రోల్ పంప్ స్టేషన్‌ను కేటాయించే సాకుతో 23 ఏళ్ల వ్యక్తికి రూ.41.49 లక్షలు మోసం చేయడమే కాకుండా, జార్ఖండ్‌లోని గిరిదిహ్ అనే నగరానికి సమావేశం కోసం ముఠా అతన్ని పిలిచింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ 'అధికారులు' చర్చకు రాకపోవడంతో భివాండి నివాసి తీవ్ర షాక్‌కు గురయ్యాడు.
 
గత ఏడాది పెట్రోల్ పంప్ స్టేషన్ కేటాయింపు కోసం ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన ప్రకటనను చూశానని వస్త్ర వ్యాపారి కుమారుడు అయిన బాధిత వ్యక్తి తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డిసెంబర్ 13న ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇండియన్ ఆయిల్ కంపెనీ అధికారి అని చెప్పుకునే వ్యక్తి నుండి కాల్ అందుకున్నాడు.
 
అలాగే ఆ వ్యక్తి అప్లికేషన్ ఆమోదించడం జరిగిందని కాలర్ చెప్పాడు. ఇంకా ఇతర స్కామర్లు ఇండియన్ ఆయిల్ అధికారులను అనుకరిస్తూ ఫిర్యాదుదారుతో వీడియో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆ ప్లాట్‌లోనే పెట్రోల్‌ పంప్‌ స్టేషన్‌ వస్తుందని చెప్పి భూమిని కూడా చూపించారు.
 
 ప్లాన్ చివరి భాగాన్ని అమలు చేస్తూ, రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, లైసెన్సింగ్, మెషినరీ వంటి అనేక సాకులతో స్కామర్లు ఫిర్యాదు దారుడి నుండి డబ్బు తీసుకుంది. ఒక నెల వ్యవధిలో, ఆ వ్యక్తి కాన్స్‌కి రూ.41.49 లక్షలను బదిలీ చేశాడు. ఆ తర్వాత, మోసగాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లోగోతో కూడిన బోగస్ పత్రాలను కూడా ఆ వ్యక్తితో పంచుకున్నారు జనవరి 12న గిరిడిహ్‌కు రావాలని కోరారు. అయితే అక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన వ్యక్తులు రాకపోవడంతో షాకయ్యాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420, 465, ప్రొవిజన్ 66D కింద కేసు నమోదు చేయబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి కోమటిరెడ్డి