Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

బీటెక్ ఫెయిల్: తండ్రి ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఉప్పుటేరులో దూకేసాడు

Advertiesment
BTech student
, బుధవారం, 13 ఏప్రియల్ 2022 (10:06 IST)
బీటెక్ ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం నాడు కాకినాడ జగన్నాథపురంలో జరిగింది.

 
వివరాలు చూస్తే... కాకినాడకు చెందిన వెంకట రమణ కుమారుడు దుర్గాప్రసాద్ బీటెక్ కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. ఇక అప్పట్నుంచి తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. అతడి స్థితిని గమనించిన తండ్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాడు.

 
ఈ క్రమంలో సోమవారం రాత్రి కుమారుడు దుర్గాప్రసాద్ ను ద్విచక్రవాహనంపై తీసుకుని వస్తుండగా ఉప్పుటేరు వంతెన రాగానే అకస్మాత్తుగా అతడు ఉప్పుటేరులో దూకేసాడు. దీనితో తండ్రి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఐతే ఇప్పటివరకూ అతడి ఆచూకి లభ్యంకాలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్