Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని..

Advertiesment
Vanaparthi
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:14 IST)
వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్‌ విద్యార్థిని రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా నల్లగుంటకు చెందిన శ్రీవర్ష.. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతుంది. 
 
కాలేజీకి వెళ్లేందుకు బుధవారం గద్వాల నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా టెస్టు కోసం శాంపిల్స్ సేకరణ : మహిళ ప్రైవేట్ భాగంలోకి...