Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

Advertiesment
lovers

సెల్వి

, బుధవారం, 18 జూన్ 2025 (19:58 IST)
ప్రేమికుడిని నమ్మింది. అతనిని వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఆ యువతిని ప్రేమికుడే హత్య చేసిన ఘటన గోవాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, సంజయ్, రోష్నిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతాల్లో పడేసి పారిపోయాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలంలో రోష్నీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. విచారణలో ఆమె ప్రేమికుడు సంజయ్ నిందితుడని గుర్తించారు.
 
హత్య వెలుగుచూసిన 24 గంటల్లోపే సంజయ్ ఆచూకీని బెంగళూరులో కనిపెట్టి అరెస్టు చేశారు.  ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్