Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టపగలు ఆస్పత్రిలో దారుణం... అందరూ చూస్తుండగా విద్యార్థిని గొంతు కోసేశాడు...

Advertiesment
murder

ఠాగూర్

, మంగళవారం, 1 జులై 2025 (11:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఓ కిరాతకుడు 19 యేళ్ల విద్యార్థిని గొంతు కోసేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది, రోగులు, రోగుల సహాయకులు కూడా చూస్తూ నిశ్చేష్టులై ఉండిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నర్సింగ్ పూర్‌కు చెందిన 19 యేళ్ళ ఇంటర్ విద్యార్థిని ఈ నెల 27వ తేదీన ఆస్పత్రికి వచ్చింది. ప్రసూతి వార్డులో ఉన్న స్నేహితురాలి బంధువును చూసేందుకు వెళుతున్నాని ఇంట్లో చెప్పి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయలుదేరింది. అయితే, ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో అభిషేక్ అనే సైకో వేధిస్తున్నాడు. 
 
ఆ యువతి ఆస్పత్రికి వచ్చిందని తెలుసుకున్న ఆ కిరాతకుడు.. ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత వార్డు నెంబరు 22వ వద్ద ఒక్కసారిగా దాడి చేసి గొంతుకోశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, రోగుల సహాయకులు నిశ్చేష్టులై చూస్తుండిపోయారు.
 
ఈ దారుణం సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. నల్లచొక్కా ధరించిన అభిషేక్... యువతిని చెంపపైకొట్టి కిందపడేశాడు. ఆ తర్వాత ఆమె ఛాతిపై కూర్చొని తనతో వెంట తెచ్చుకుని కత్తితో ఆమె గొంత కోశాడు. ఇంత ఘోరం జరుగుతున్నా అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. ఆ విద్యార్థిని తీవ్ర రక్తస్రావంతో అక్కడే కన్నుమూసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...