Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. కోహ్లీ అవుట్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. కోహ్లీ అవుట్
, మంగళవారం, 28 మే 2019 (17:21 IST)
వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. 
 
భారత్ రెండవ మ్యాచ్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. కేదార్ జాదవ్ ఇంకా ఫిట్‌గా లేడని కోహ్లీ తెలిపాడు. ఇంగ్లండ్ చేరుకున్న రెండు రోజుల్లోనే వార్మప్ మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని, అందువల్లే సరిగా ఆడలేకపోయామని కోహ్లీ చెప్పాడు. కార్డిఫ్‌లోని సోషియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
 
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. అర్ధశతకానికి చేరువలో ఉన్న కెప్టెన్‌ కోహ్లీ (46 బంతుల్లో ఐదు ఫోర్లతో 47 పరుగులు)ని సైఫుద్దీన్‌ చక్కటి యార్కర్‌తో బౌల్డ్‌చేశాడు. అంతకు ముందు ధావన్‌(1), రోహిత్‌శర్మ(19) తక్కువ పరుగులకే ఔటయ్యారు.

దీంతో టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌(13), విజయ్‌శంకర్‌ ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌతమ్ గంభీర్‌కు మెదడుందా? అఫ్రిది ఫైర్ (వీడియో)