Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్ బలం, బలహీనత మాకు తెలుసు.. విజేతలుగానే ఫైనల్‌కు సిద్ధపడతామన్న కోహ్లీ

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో ఘోరంగా ఆడి భారత్ల చేతిలో చిత్తయినప్పటికీ అనూహ్యంగా కోలుకుని వరుసుగా మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన రీతిలో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడటానికి తమ వ్యూహాల్లో కొత్త మార్పులు ఏవీ అవసరం లేదన

పాక్ బలం, బలహీనత మాకు తెలుసు.. విజేతలుగానే ఫైనల్‌కు సిద్ధపడతామన్న కోహ్లీ
హైదరాబాద్ , శనివారం, 17 జూన్ 2017 (02:22 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో ఘోరంగా ఆడి భారత్ల చేతిలో చిత్తయినప్పటికీ అనూహ్యంగా కోలుకుని
వరుసుగా మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన రీతిలో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడటానికి తమ వ్యూహాల్లో కొత్త మార్పులు ఏవీ అవసరం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తేల్చి చెప్పాడు. పాక్ బలం, బలహీనతలు మాకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ ప్రాతిపదికనే మేం పథక రచన చేపడతామని, జట్టులో భారీ మార్పులు చేయవలసిన అవసరం లేదని కోహ్లీ తెలిపాడు.
 
భారత్, పాక్‌ హై ఓల్టేజి ఫైనల్‌ మ్యాచ్‌ గురించి మాత్రం కోహ్లి చాలా తేలిగ్గానే స్పందించాడు. ‘ఇప్పటిదాకా మేం కొనసాగించిన ఆటనే ఫైనల్లోనూ ప్రదర్శిస్తాం. పాక్‌ బలం, బలహీనతల గురించి మాకు తెలుసు. దానికి తగ్గట్టుగా మా ప్రణాళికలు ఉంటాయి. కానీ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. సమష్టిగా మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఫైనల్‌ రోజు మా స్థాయికి తగ్గ ఆటను మైదానంలో కనబరిస్తే ఫలితం అదే వస్తుంది. ముందుగానే ఎవరినీ విజేతలుగా అంచనా వేయలేం. ఇప్పటిదాకా కొన్ని ఆశ్చర్యకర ఫలితాలను చూశాం’ అని కోహ్లి తెలిపాడు. 
 
చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ ప్రదర్శన ఆకట్టుకుందని కొనియాడాడు. ఓ జట్టు మంచి క్రికెట్‌ ఆడితేనే ఫైనల్‌కు వస్తుందని, పరిస్థితులను వారికి అనుకూలంగా మలుచుకుని అద్భుత ఫలితాలను సాధించారని కొనియాడాడు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను సునాయాసంగా ఓడించి భారత్‌.. మరో సెమీస్‌లో ఊపుమీదున్న ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాక్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ అనంతరం తాను సన్నద్ధమైన తీరు ప్రస్తుత టోర్నీలో ఫలితం చూపిస్తోందని చెప్పాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమేనని చెప్పాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఫిక్సింగ్.. అందుకే ఫైనల్‌కు పాకిస్థాన్ : ఆరోపణలు చేసిన పాక్ దిగ్గజ క్రికెటర్