Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాహల్ దెబ్బకు తుర్రుమని పారిపోయిన ధోనీ... (video)

Advertiesment
చాహల్ దెబ్బకు తుర్రుమని పారిపోయిన ధోనీ... (video)
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (09:48 IST)
భారత క్రికెట్ జట్టు యువస్నిన్నర్ యజ్వేంద్ర చాహల్. అతని దెబ్బకు భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పారిపోయాడు. అదీ కూడా అలా ఇలా కాదు.. తుర్రుమని మెరుపు వేగంతో పారిపోయి డ్రెస్సింగ్ రూమ్‌లో చేరిపోయాడు. ఇంతకు ఓ యువ బౌలర్ దెబ్బకు ధోనీ పారిపోవడానికిగల కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
సాధారణంగా ఎలాంటి మీడియా సమావేశమైనా సరే, ఎంతటి క్లిష్టమైన ప్రశ్నకు అయినా సరే ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పే వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. అలాంటి ధోమీ.. మీడియాను చూసి పారిపోయాడు. అదీ కూడా చాహల్ దెబ్బకు. 
 
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో భారత క్రికెట్ చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో టీమిండియా యువ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ తన 'చాహల్‌ టీవీ'తో మాట్లాడాల్సిందిగా ధోనీ ముందు మైక్‌ పెట్టాడు. 
 
ఇందుకు ధోనీ నిరాకరించాడు. అయినా, మాట్లాడాల్సిందేనంటూ చాహల్‌ బలవంతం చేయబోవడంతో, సరదాకో, సీరియ్‌సగానో తెలియదు గానీ.. ధోనీ అక్కడి నుంచి తప్పించుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌పైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత క్రికెటర్ల వీరకుమ్ముడు... ర్యాంకులన్నీ మనవే...