Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూపర్ యార్కర్.. చెదిరిపోయిన స్టంప్.. కారణం ఎవరు? (Video)

సూపర్ యార్కర్.. చెదిరిపోయిన స్టంప్.. కారణం ఎవరు? (Video)
, శనివారం, 11 జనవరి 2020 (17:52 IST)
శ్రీలంకతో జరిగిన చివరి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపును నమోదు చేసుకుని ట్రోఫీని గెలుచుకుంది. భారత్-శ్రీలంక మధ్య పూణేలో శుక్రవారం ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (54), శిఖర్ ధావన్ (52) అర్థసెంచరీలతో శుభారంభాన్నిచ్చారు. తదనంతరం మనీష్ పాండే (31), విరాట్ కోహ్లీ (26)లు మోస్తరుగా రాణించారు. ఇంకా ఫాస్ట్ బౌలర్ సర్దుల్ ఠాగూర్ 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీతో కలిసి 22 పరుగులు సాధించాడు. ఫలితంగా 20 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. 
 
ఆపై 202 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభం నుంచే తడబడింది. టీమిండియా బౌలర్ల ధాటికి లంకేయులు బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. శ్రీలంక జట్టులో మాథ్యూస్ మాత్రమే అత్యధికంగా 31 పరుగులు సాధించాడు. ధనంజయ సిల్వ 57 అర్థసెంచరీ సాధించాడు.

మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప పరుగులకే అవుటై పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో 15.5 ఓవర్లలో శ్రీలంక జట్టు 123 పరుగులు మాత్రమే సాధించి ఆలౌటైంది. దీంతో 78 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని టీ-20 సిరీస్‌ను 2-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌కు బంతి విసిరిన యువ బౌలర్ నవదీప్ సైనీ.. యాకర్ బౌలింగ్‌తో శ్రీలంక వికెట్ కీపర్ పెరెరా వికెట్‌ను తీసుకున్నాడు. సైనీ విసిరిన బంతికి స్టంప్ చెదిరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యార్కర్‌తో అదరగొట్టి అద్భుతమైన వికెట్ చేజిక్కించుకున్న సైనీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు.. సచిన్ శుభాకాంక్షలు.. ఫోటో వైరల్