Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జవాన్ల పిల్లల్ని నేను చదివిస్తానంటున్న మాజీ క్రికెటర్.. ఎవరు?

Advertiesment
Virender Sehwag
, ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (10:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు భరతజాతి మొత్తం మద్దతుగా నిలుస్తోంది. ముఖ్యంగా, అదేసమయంలో జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది సెలెబ్రిటీలు మందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ఢిల్లీకి చెందిన ఈ మాజీ క్రికెటర్ తనది పెద్ద మనసు అంటూ మరోమారు నిరూపించాడు. 
 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పిల్లల పట్ల భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన సహృదయతను చాటుకున్నాడు. కన్నవాళ్లను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న సైనికుల కుటుంబాలకు బాసటగా నిలిచాడు. వీరసైనికుల పిల్లల చదవుకయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానంటూ సెహ్వాగ్ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 
 
'దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం. ఉగ్రదాడిలో మరిణించిన సీఆర్పీఎఫ్ వీర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుంటున్నాను. వారంతా నా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకోవచ్చు' అని వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించాడు. సెహ్వాగ్ ధాతృత్వంపై నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుల్వామా దాడి: పాకిస్థాన్‌పై క్రికెటర్ల ఫైర్ (వీడియో)