ఐపీఎల్లో విరాట్ కోప్లీ పరుగుల వరద పారిస్తున్నారు. అర్థసెంచరీ చేస్తేనే చాలనుకునే టీ20ల్లో వరుస సెంచరీలు చేస్తున్నాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (108 నాటౌట్; 58 బంతుల్లో 8×4, 7×6) మరోసారి చెలరేగిన వేళ.. రైజింగ్ పుణెపై బెంగళూరు అద్భుత విజయాన్ని సాధించింది. విరాట్కు ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ.
శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత మొదట బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణె 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానె (74; 48 బంతుల్లో 8×4, 2×6) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి మెరుపులతో బెంగళూరు 19.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కోహ్లితో పాటు వాట్సన్ (36, 13 బంతుల్లో 5×4, 2×6), రాహుల్ (38, 35 బంతుల్లో 1×4, 2×6) రాణించారు.
మూడు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విరాట్ కళ్లు చెదిరేలా ఆడాడు. జంపా బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన అతను.. ఆ తర్వాత మరో ఫోర్ కొట్టడంతో బెంగళూరు సాధించాల్సిన లక్ష్యం కరిగిపోయింది. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సి ఉండగా మరో రెండు సిక్స్లు బాదిన విరాట్ బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు. అంతేకాదు 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.