వచ్చే యేడాది 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగనుంది. భారత్ - శ్రీలంక దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు టోర్నీ జరుగనుంది. అయితే, భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య కొలంబో వేదికగా ఫిబ్రవరి 16వ తేదీన జరుగనుంది.
కాగా, ఈ టోర్నీలో ఈ దఫా మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. ఇందులో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని నాలుగు జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్లు భారత్లోని అయిదు వేదికల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలోని మూడు వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి.
షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్, భారత జట్టు మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. భారత్కు 2024 ప్రపంచ కప్ సాధించిన పెట్టిన రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.
భారత్ మ్యాచ్ షెడ్యూల్ వివరాలు...
ఫిబ్రవరి 7 - యూఎస్ఏతో.. ముంబై
ఫిబ్రవరి 12 - నమీబియాతో.. ఢిల్లీ
ఫిబ్రవరి 15 - పాకిస్థాన్తో.. ప్రేమదాస స్టేడియం, కొలంబో
ఫిబ్రవరి 18 - నెదర్లాండ్స్తో.. అహ్మదాబాద్