Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ20 ప్రపంచ కప్ విజయోత్సవ ఊరేగింపునకు ముంబై సిద్ధం

Team India

వరుణ్

, గురువారం, 4 జులై 2024 (13:40 IST)
యావత్ భారతదేశం గర్వపడేలా టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ కప్‌తో దేశ రాజధాని ముంబైలో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనాలంటూ అభిమానులను ఆహ్వానించింది. ఈ మేరకు రోహిత్ శర్మ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. 
 
గురువారం భారత్‌కు చేరుకున్నాక టీమిండియా ప్రధాని మోడిని కలిసింది. అనంతరం, టీం సభ్యులందరూ చార్టెడ్ ఫ్లైట్ ముంబై చేరుకుంటారు. ఆ తరువాత విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వాంఖడే చేరుకుంటారు. ఈ క్రమంలో ఓపెన్ బస్ కవాతు చేద్దామని నిర్ణయించారు. పరేడ్‌లో పాల్గొనేందుకు రావాలంటూ అభిమానులను టీమిండియా రథసారధి రోహిత్ శర్మ ఆహ్వానించాడు.
 
'ఈ ప్రత్యేక క్షణాల్ని మీ అందరితో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. జులై 4 సాయంత్రం 5 గంటలకు మెరీన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ జరిగే పరేడ్‌లో మనందరం పాల్గొని భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం' అని రోహిత్ శర్మ పోస్టు పెట్టాడు. అలాగే, బీసీసీఐ అధ్యక్షుడు జై షా కూడా ఈ వేడుకల్లో అభిమానులు సైతం పాల్గొనాలని పిలుపునిచ్చారు.
 
ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే వరకూ ఓపెన్ బస్ పరేడ్ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో జై షా టీమిండియా సభ్యులకు రూ.125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్ పేరున్న ప్రత్యేక చార్టెడ్ విమానం టీంసభ్యులతో బార్బడాస్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.50 గంటలకు బయలుదేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న టీమిండియా!!