Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిమ్మలను చూసి గర్విస్తున్నాం.. మీకంటూ ఓ రోజు వస్తుంది.. సచిన్

Advertiesment
Sachin Tendulkar
, సోమవారం, 9 మార్చి 2020 (08:10 IST)
ఐసీసీ మహిళల ట్వంటీ20 క్రికెట్ టోర్నీ భారత యువ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. లీగ్ మ్యాచ్‌లన్నింటిలో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన భారత జట్టు.. ఫైనల్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు ముందు తలవంచింది. దీంతో ట్రోఫీని తొలిసారి ముద్దాడాలన్న కోరిక నెరవేరలేదు. పైగా, ఈ ఓటమితో జట్టు సభ్యులు బోరున విలపించారు. కుంగిపోయారు. 
 
ఈ నేపథ్యంలో యువ మహిళా క్రికెటర్ల ఆటతీరుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలియజేశారు. "టీమిండియాకు ఇది నిజంగా క్లిష్టమైన సమయం. మనది ఇంకా యువ జట్టే కాబట్టి భవిష్యత్తులో మరింత దృఢమైన జట్టుగా ఎదుగుతుంది. ఇప్పటివరకు మీ ప్రదర్శన పట్ల ఎంతో గర్విస్తున్నాం. కఠోరంగా శ్రమించండి, ఆశాభావాన్ని వీడొద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా సాధిస్తారు" అంటూ ట్విట్టర్‌లో ఓదార్పు వచనాలు పలికారు.
 
కాగా, మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా వచ్చిన టీమిండియా, ఆఖరిపోరాటంలో విఫలం కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారీ లక్ష్యఛేదనలో కనీస పోరాటం కూడా లేకుండా టీమిండియా అమ్మాయిలు ఓడిన విధానం మరింత బాధిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ : టీమిండియా ఎంపిక.. సభ్యులు ఎవరంటే...