Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ?

Advertiesment
SA Tour
, మంగళవారం, 7 డిశెంబరు 2021 (22:32 IST)
టీ20 ప్రపంచకప్ ముందు టీ20 సారథ్యాన్ని వదిలేస్తున్నానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించిన అతనికి నిరాశే ఎదురైంది. టైటిల్ దేవుడెరుగు కనీసం సెమీస్ చేరకుండానే టీమిండియా ఇంటిదారి పట్టింది.  
 
తాజాగా సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగాలనుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వర్గాలు పేర్కొన్నాయి. 
 
కోహ్లీ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. తన ఫస్ట్ సిరీస్‌లో అద్భుత విజయాన్నందించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో వన్డే, టీ20 ఫార్మాట్లకు ఒక్కడే కెప్టెన్ ఉంటేనే భాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మకే వన్డే కెప్టెన్సీ కూడా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. దీంతో కోహ్లీ పరిమిత ఓవర్ల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌ క్రికెట్ జట్టు 3 టెస్ట్‌ల సిరీస్ : సౌతాఫ్రికా జట్టు ఎంపిక