Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2023 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

mumbai indians
, ఆదివారం, 21 మే 2023 (19:53 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ జట్టుతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
హైదరాబాద్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది. కామెరూన్‌ గ్రీన్ 47 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో సరిగ్గా వంద పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 
 
అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 56 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో సాయంతో 25 (నాటౌట్)గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, మయాంక్ దగార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేయగా, వివ్రాంత్ శర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రాణించారు. అలాగే, క్లాసెన్ (18) పరుగులు చేయగా..  గ్లెన్‌ ఫిలిప్స్‌ (1), బ్రూక్‌ (0)లను నిరాశపరిచారు. సన్వీర్ సింగ్ (4), మార్‌క్రమ్ (13) నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో ఆకాశ్‌ మధ్వల్ 4, జోర్డాన్‌ ఒక వికెట్ పడగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంతగడ్డపై ఢిల్లీని చిత్తు చేసి ప్లే ఆఫ్ రౌండ్‌లోకి చెన్నై కింగ్స్ ఘనవిజయం